పాల్వంచలో 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు!

పాల్వంచలో 1600 మెగావాట్ల విద్యుత్   ప్లాంట్ల ఏర్పాటు!
  • సాద్యాసాధ్యాలను పరిశీలించాలని కేబినెట్​ లో నిర్ణయం

భద్రాద్రికొత్తగూడెం. వెలుగు : జిల్లాలోని పాల్వంచలో 1600మెగావాట్ల   పవర్​ ప్లాంట్ల ఏర్పాటుకు తొలి అడుగు పడింది. 800మెగా వాట్ల పవర్​ ప్లాంట్లురెండు ఏర్పాటు చేసే విషయమై సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. 

పాల్వంచలో గతంలో కూల్చి వేసిన పవర్​ ప్లాంటు స్థానంలో కొత్త ప్లాంట్లు నిర్మించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్​ రెడ్డితో పాటు పలుమార్లు విద్యుత్​ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, అగ్రికల్చర్​ మినిస్టర్​  తుమ్మల నాగేశ్వర రావుకు  వినతిపత్రం ఇచ్చారు. పాల్వంచలో విద్యుత్​ పవర్​ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలిస్తానని గతంలో డిప్యూటీ సీఎం భట్టి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. 

విద్యుత్​ పవర్​ ప్లాంట్ల ఏర్పాటుపై పరిశీలన చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్వహించడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవర్​ ప్లాంట్ల ఏర్పాటు ఎన్టీపీసీకి ఇస్తే విద్యుత్​ యూనిట్​ ఎంత రేట్​ పడుతుంది, జెన్​కో అప్పగిస్తే ఎంత రేట్​ పడుతుంది అనే విషయాలపై పరిశీలన చేయాలని కేబినెట్​ నిర్ణయించింది.

 ముందుగా అంచనాలు వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని కేబినెట్​ నిర్ణయించింది. విద్యుత్​ పవర్​ ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి వర్గం చర్చించడం పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.