తెలంగాణకు ఫ్రీగా 1.63 కోట్ల డోసులు

తెలంగాణకు ఫ్రీగా 1.63 కోట్ల డోసులు
  • రాజ్యసభలో కేంద్ర మంత్రి భారతీపవార్ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు 1,63,96,460 కరోనా వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించినట్లు కేంద్రం వెల్లడించింది. జులై 25 వరకు ఈ డోసులను రాష్ట్రానికి సప్లై చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ  ప్రవీణ్​పవార్ స్పష్టం చేశారు. ఇందులో 1,17,80,450 కొవిషీల్డ్, 46,16,010  కొవాగ్జిన్ డోసులు ఉన్నట్లు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 44.91 కోట్ల వ్యాక్సిన్ ​డోసులను రాష్ట్రాలకు ఉచితంగా అందించినట్లు వివరించారు. వ్యాక్సిన్ల సేకరణ, నిర్వహణతో కలిపి వ్యాక్సినేషన్ పోగ్రాంకు ఇప్పటివరకు రూ.9,725.15 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.