స్కూల్ బస్సు బోల్తా17 మందికి విద్యార్థులకు గాయాలు

 స్కూల్ బస్సు బోల్తా17 మందికి విద్యార్థులకు గాయాలు

చేవెళ్ల, వెలుగు: ప్రైవేట్​ స్కూల్​ బస్సు బోల్తా పడి 17 మందికి విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్​ లోని హైదరాబాద్​స్కూల్​ఆఫ్​ఎక్సలెన్స్ కు చెందిన 25 మంది విద్యార్థులు ఒక టీచర్, ఆయాతో కలిసి యాన్యువల్ డే ప్రోగ్రామ్​ రిహార్సల్స్​కోసం బుధవారం స్కూల్​బస్సులో మొయినాబాద్ మున్సిపల్​ పరిధిలోని చాందిని గార్డెన్​కు వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా మృగవని పార్క్​వద్ద బస్సు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 17 విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో గాయపడిన వారిని పోలీసులు సమీప హాస్పిటల్​కు తరలించారు. ఈ ఘటనలో విద్యార్థులెవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని, ఇప్పటికే 14 మందిని డిశ్చార్జి చేసినట్లు డీఈవో సుశీందర్​ రావు తెలిపారు. డ్రైవర్​నిర్లక్ష్యమే ప్రమాధానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు రాగా, టైర్​పంక్చర్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు డీఈవో ప్రెస్​నోట్​లో పేర్కొనడం గమనార్హం.