23న ‘18 పేజెస్’ మూవీ విడుదల

23న ‘18 పేజెస్’ మూవీ విడుదల

‘కార్తికేయ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ‘18 పేజెస్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుకుమార్ కథ అందించిన ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు.  బన్నీ వాసు నిర్మాత.  డిసెంబర్ 23న సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్..రెండు పాటలను రిలీజ్ చేసింది. తాజాగా ‘ఏడు రంగుల వాన’ పాటను చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ లాంచ్ చేశారు.

గోపి సుందర్ ట్యూన్ చేసిన సాంగ్‌‌‌‌కు శ్రీమణి లిరిక్స్  రాశాడు. సిద్ శ్రీరామ్ పాడాడు.  సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఇది సాధారణ మైన లవ్ స్టోరీ కాదు. చాలా డిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది. నిఖిల్ చాలా డెడికేటెడ్‌‌‌‌గా వర్క్ చేస్తాడు. నేచురల్‌‌‌‌గా నటించే అనుపమను చూసినప్పుడల్లా తనలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ ‘ప్రతి యాక్టర్‌‌‌‌‌‌‌‌కు గీతా ఆర్ట్స్‌‌‌‌లో వర్క్ చేయడం డ్రీమ్. అందులోనూ సుకుమార్ గారి రైటింగ్‌‌‌‌లో చేయడం చాలా హ్యాపీ. ఇదొక క్రేజీ లవ్ స్టోరీ. సిద్ధు పాత్రలో కనిపిస్తాను’ అని చెప్పాడు. ‘కార్తికేయ’ తర్వాత నిఖిల్‌‌‌‌తో వర్క్ చేయడం హ్యాపీ అంది అనుపమ. ‘ఏడు రంగుల వాన’ పాటకు మంచి  రెస్పాన్స్ వస్తోందన్నారు దర్శకుడు సూర్య ప్రతాప్, నిర్మాత బన్నీ వాసు.  లిరిసిస్ట్ శ్రీమణి, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ పాల్గొన్నారు.