టీటీడీ బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు

టీటీడీ బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు
  • 18 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసిన హైకోర్టు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో 24 మందిని నియమిస్తూ ప్రభుత్వ జారీ చేసిన జీవోపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 245ను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్వినీ కుమార్‌ కోర్టులో పిటిషన్ వేశారు. బోర్డులోని 14 మందికి నేర నేరచరిత్ర ఉందని, మరో నలుగురిని.. రాజకీయ నియామకాలు చేశారని న్యాయవాది ఆరోపించారు. బోర్డులోని 18 మందిని ప్రతివాదులుగా చేర్చాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేయగా న్యాయస్థానం సానుకూలంగా స్పందించి 18 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 
దసరా సెలవుల అనంతరం కేసును ప్రాధాన్యతగా తీసుకుని విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. టీటీడీ బోర్డులోని 18 మందిని ప్రతివాదులుగా చేర్చడంపై టీటీడీ దేవస్థానం తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీనిపై మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతివాదులకు ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు తెలపాలని వ్యాఖ్యానించింది.