రాష్ట్రంగా కొత్తగా 1920 కరోనా కేసులు

రాష్ట్రంగా కొత్తగా 1920 కరోనా కేసులు

హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తెలంగాణలోనూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మంగళవారం 83,153 మందికి పరీక్షలు నిర్వహించగా 1920 మందికి కోవిడ్ నిర్థారణ అయింది. వీరిలో 1015మంది జీహెచ్ఎంసీలోనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 417మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇద్దరు చనిపోయారు.  రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.57శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.05శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 16,496 యాక్టివ్ కేసులున్నాయి.

FOR MORE NEWS..

పండ్ల వ్యాపారిపై మహిళ దౌర్జన్యం

హోం ఐసోలేషన్ లో సినీ నటి కీర్తి సురేష్