మొబైల్ ఫోన్ల అమ్మకానికి అనుమతులివ్వండి..

మొబైల్ ఫోన్ల అమ్మకానికి అనుమతులివ్వండి..

‘ఎసెన్షియల్ సర్వీసెస్’ కేటగిరీలో మెబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చేర్చాలని కేంద్రాన్ని కోరింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( CIIT ). దీంతో పాటు…. లాక్ డౌన్ కారణంగా 2.5 కోట్ల మొబైల్ వినియోగదారులు వారి ఫోన్‌లకు చెందిన విడిబాగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని అంచనా వేసింది ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ( ICEA ). లాక్ డౌన్ మే చివరి  వరకు కొనసాగితే దాదాపు 4 కోట్ల మంది ప్రజలు మొబైల్ సమస్యలతో బాధపడతారని చెప్పింది.

ప్రస్తుతం కరోనా విజృంబిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మే3వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది. అయితే అత్యవసర వస్తువుల అమ్మకానికి అనుమతినిచ్చింది. దీంతో పాటు టెలికాం, ఇంటర్నెట్ ప్రసారం, ఐటీ సేవల కార్యకలాపాలకు కేంద్రం అంగీకరించింది.. ఇందుకు గాను మొబైల్ అమ్మకాలను కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరిలో చేర్చి…  ఫోన్లు, విడిబాగాలు, ల్యాప్ టాప్‌ల అమ్మకానికి అనుమతులివ్వాలని కోరింది CIIT. ఈ నెల22న కేంద్ర హోం శాఖకు లెటర్ రాసింది  ICEA. ఆరోగ్య సేతు యాప్ ను వాడాలన్నా స్మార్ట్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాల్సిఉంటదని.. దీంతో కోటి మంది   యాప్ సేవలను ఉపయోగించుకోకుండా ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు  ICEA  చైర్మన్ పంకజ్ మొహింద్రూ.