
- రాజస్థాన్లో అదుపులోకి తీసుకన్న పోలీసులు
జైపూర్: మన దేశానికి చెందిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ను పాకిస్తాన్కు చేరవేస్తున్న ఇద్దరు సివిల్ డిఫెన్స్ ఆఫీసర్లు వికాస్ కుమార్ (29), చిమల్ లాల్ (22)ను పోలీసులు అరెస్టు చేశారు. మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారంతో ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. శ్రీనగర్ జిల్లాలోని ఆర్మీ మందుగుండు సామాగ్రి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని అధికారులు చెప్పారు. “ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ చేస్తుండగా వారిని పట్టుకున్నాం. ఆఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద అరెస్టు చేశామని, దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం” అని ఇంటెలిజెన్స్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేశ్ మిశ్ర అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కుమార్ అనే వ్యక్తిని ఆగస్టులో అరెస్టు చేసినట్లు చెప్పారు. ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో చాట్ చేసి వాళ్లను ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన ఇద్దర్ని లోకల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు.