జర్నీ మూవీ సీన్ తరహాలోనే.. : రెండు బస్సులు.. ఎదురెదురుగా ఢీకొన్నాయి..

జర్నీ మూవీ సీన్ తరహాలోనే.. : రెండు బస్సులు.. ఎదురెదురుగా ఢీకొన్నాయి..

తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా మేల్‌పట్టంపాక్కంలో జర్నీ సినిమాను తలపించేలా ఓ ఘటన చోటుచేసుకుంది. జూన్ 19న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 70 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సుల ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.  

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, బస్సులలో ఒకదాని ముందు టైర్ పగిలిపోవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీని ఫలితంగా ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

సంఘటన ప్రదేశం బీభత్సంగా ఉంది. రెండు బస్సుల్లోని ప్రయాణికులు కొందరు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ప్రమాదం తర్వాత అరుపులు, కేకలు, ఏడుపులతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బస్సుల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు.
 

https://twitter.com/ANI/status/1670698931628695552