రష్యా-ఉక్రెయిన్ వార్పై యూఎస్ టాప్ జనరల్ మార్క్ మిల్లీ
వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ వార్లో ఇప్పటిదాకా 2లక్షల మంది సైనికులు చనిపోయారని, వేలాది మంది గాయపడ్డారని యూఎస్ టాప్ జనరల్ మార్క్ మిల్లీ గురువారం తెలిపారు. 8 నెలల నుంచి వార్ కొనసాగుతోందన్నారు. 2 దేశాల్లో లక్ష మంది సైనికుల చొప్పున చనిపోయారని చెప్పారు. న్యూయార్క్ ఎకనామిక్ క్లబ్ ప్రోగ్రాంలో మార్క్ మిల్లీ మాట్లాడారు. ఈ వార్లో 40 వేల మంది పౌరులు కూడా చనిపోయారని అంచానా వేశారు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టే ఆలోచనలో ఉక్రెయిన్ ఉన్నట్టు తెలుస్తున్నదన్నారు. ఈ విషయంలో రష్యాతో చర్చలు జరిపేందుకు కీవ్ ఆసక్తి చూపుతోందని మార్క్ మిల్లీ తెలిపారు.
చలికాలంలో యుద్ధం చేయలేరు..
రెండు దేశాలు చర్చలపై ఆసక్తి చూపుతున్నట్టు మిల్లీ వెల్లడించారు. ప్రాణ నష్టం ఎక్కువగా ఉండటం, రాబోయే చలికాలం మంచు కురుస్తూ ఉండటంతో యుద్ధం కష్టంగా మారుతుందన్నారు. చర్చలతోనే వార్ ముగుస్తుందని తేల్చి చెప్పారు. సైనికుల ద్వారా ఏ దేశం విజయం సాధించబోదని అన్నారు. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ సిటీ నుంచి రష్యా తన బలగాలను ఉప సంహరించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మార్క్ మిల్లీ ఈ కామెంట్లు చేశారు. రష్యా నిర్ణయాన్ని ఉక్రెయిన్ తప్పుబట్టింది. వార్ స్ర్టాటజీలో భాగంగానే రష్యా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుందని విమర్శించింది.