తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.  వీకెండ్ కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలో వేచి ఉన్నారు భక్తులు. సర్వ దర్వనం క్యూ రికార్డు స్థాయిలో లేపాక్షి సర్కిల్ దాటి షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా బస్టాండ్ వరకు చేరుకుంది. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు. నిన్న స్వామివారిని 71 వేల 589 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 4 కోట్ల 30 లక్షలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 41 వేల 240 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పంచి మొక్కులు చెల్లించుకున్నారు.