
లింగంపేట,వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట శివారులోని పట్నం చెరువులో ఆదివారం 20 కిలోల చేప జాలరి వలకు చిక్కింది. మృగశిర కార్తె సందర్భంగా చెరువులో చేపల కోసం వల వేయగా బంగారు తీగ జాతికి చెందిన 20 కిలోల చేప చిక్కినట్లు జాలర్లు తెలిపారు.
ఈ చేపను మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కిషన్ రూ.2 వేలకు కొనుగోలు చేసినట్లు గ్రామస్తులు చెప్పారు. ఇదే చెరువులో మరో 20 కిలోల గ్యాస్కట్చేప లభించినట్లు పేర్కొన్నారు.