పాకిస్తాన్ లో రైలు ఢీ కొని బస్సులోని 20 మంది మృతి

పాకిస్తాన్ లో రైలు ఢీ కొని బస్సులోని 20 మంది మృతి

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  రైల్వేక్రాసింగ్ దగ్గర బస్సును వేగంతో వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది సిక్కు యాత్రికులు చనిపోయారు. మరి కొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పంజాబ్ ప్రావిన్స్ లోని షీకుపురా జిల్లా ఫరీదాబాద్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన 25 మంది యాత్రికులు మినీ బస్సులో  వెళుతుండగా  ఫరీదాబాద్ దగ్గర రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది.