పారాబాయిల్డ్ ​ రైస్​ ఎక్స్​పోర్ట్స్​పై 20 శాతం డ్యూటీ

పారాబాయిల్డ్ ​ రైస్​ ఎక్స్​పోర్ట్స్​పై 20 శాతం డ్యూటీ

న్యూఢిల్లీ: దేశీయంగా తగినన్ని నిల్వలు ఉండేలా చూసే ఉద్దేశంతో పారాబాయిల్డ్​ రైస్​ ఎగుమతులపై 20 శాతం డ్యూటీని ప్రభుత్వం విధించింది. దేశంలో ధరలు పెరగకుండా చూడాలనేది కూడా ఒక లక్ష్యం. ఆగస్టు 25 నుంచి అమలవుతున్న ఈ డ్యూటీ విధింపు అక్టోబర్​ 16 దాకా అమలులో ఉంటుందని ఫైనాన్స్​ మినిస్ట్రీ వెల్లడించింది. ఆగస్టు 25 కి ముందుగా  కస్టమ్స్​ పోర్టులలో ఉంచిన పారాబాయిల్డ్​ రైస్​ కి మాత్రం డ్యూటీ ఎగ్జంప్షన్​  ఉంటుందని పేర్కొంది. ఈ చర్యతో అన్ని రకాల నాన్​–బాస్మతి రైస్​పైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లయింది. 

దేశం నుంచి ఎగుమతయ్యే రైస్​లో నాన్​–బాస్మతి వైట్​రైస్​కి 25 శాతం వాటా ఉంటోంది. నాన్​– బాస్మతి రైస్​ ఎగుమతులను కిందటి నెల నుంచి ప్రభుత్వం నిషేధించింది. రాబోయే పండగ సీజన్​లో దేశంలో బియ్యం రేట్లు పెరగకుండా చూడాలనే టార్గెట్​తోనే ఈ నిషేధం విధించారు. ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో ఇండియా నుంచి 15.54 లక్షల టన్నుల నాన్​–బాస్మతి వైట్  ​రైస్​ ఎగుమతులు జరిగాయి.