సికింద్రాబాద్, వెలుగు: ఎలాంటి ఆపరేషన్ లేకుండానే మోకాలి కీళ్ల నొప్పులకు వైద్యం అందిస్తున్నామని ఇపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారా, డాక్టర్ మీనల్ చంద్ర తెలిపారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మోకాలి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న 20 వేల మందికి తమ సెంటర్లో ఎలాంటి ఆపరేషన్ లేకుండా మందుల ద్వారా నయం చేశామన్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న వారు తమ పనులను ఈజీగా, ఎలాంటి బాధ లేకుండా చేసుకుంటున్నారని వారు తెలిపారు. ఇపియోన్ పెయిన్ క్లినిక్, రీజనరేటివ్ థెరపీ సెంటర్ అనేది దేశంలోనే మొట్టమొదటి మల్టీ డిసిప్లీనరీ పెయిన్మేనేజ్మెంట్ సెంటర్అని వారు చెప్పారు.
ప్రతి పేషెంట్కు ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉపయోగించి ప్లాస్మా థెరపీ చేయడం తమ సెంటర్ ప్రత్యేకత అని వెల్లడించారు. లేటెస్ట్ మెషీన్లు, ఫెసిలిటీస్తో పేషెంట్లకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు. అత్యంత త్వరితగతిన ఫలితాలను అందించడం కోసం సోనోసైట్ పీ-ఎక్స్ మెషీన్ను ఏర్పాటుచేసిన మొదటి కేంద్రం తమదేనన్నారు. మన దేశంలో ఇప్పటికే చెన్నై, బెంగుళూరు నగరాల్లో ఇపియోన్సెంటర్లను ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో మరో పది నగరాల్లో తమ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ చికిత్సను విస్తరించనున్నామని డాక్టర్ సుధీర్ దారా, మీనల్ చంద్ర తెలిపారు.