
విశాఖలో భక్తి ముసుగులో మోసానికి తెగబడ్డారు కొందరు యువకులు. భారీ గణనాధుడు పేరుతో భక్తులను ఛీటింగ్ చేశారు. నియమ నిబంధలను ఉల్లంఘిస్తూ.. గాజువాక లంక గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర నిర్వాహకులు టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దర్శనం టికెట్లు... పార్కింగ్ టికెట్స్ అమ్ముతూ.. జనాలను దోచుకుంటున్నారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసఉకొని దర్శనాలను నిలిపివేశారు. గణేష్ మండపాల వద్ద ఎటువంటి కమర్షియల్ టికెట్స్ ఉండకూడదని విశాఖ పోలీసులు ఆంక్షలు విధించారు.