కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి జీఎంఆర్ టౌన్షిప్లో ఉన్న ఓ సింగరేణి ఉద్యోగి ఇంట్లో దొంగలుపడి 20తులాల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. టౌన్షిప్కు చెందిన అమీర్ఖాన్ శాంతిఖని గనిలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి గోదావరిఖనిలో ఉన్న తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి పొద్దుపోయాక తిరిగి వచ్చాడు.
ఇంటి మొయిన్ డోర్పక్కనున్న గ్రిల్తొలగించి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 20తులాల బంగారు అభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. శుక్రవారం రామకృష్ణాపూర్ పోలీసులకు సమాచారం అందించగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, మందమర్రి సీఐ పర్స రమేశ్అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అమీర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుజరుగుతోంది.
