- హర్షం వ్యక్తం చేసిన కార్మికులు.. వివేక్ ఫొటోకు క్షీరాభిషేకం
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతోనే తమకు తిరిగి ఉద్యోగాలు దక్కాయని, ఆయనకు రుణపడి ఉంటామని సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్క్లబ్ఆవరణలో మంత్రి వివేక్ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మందమర్రి సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న 213 మంది కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుల టెండర్కాలపరిమితి ముగిసిందని, యాజమాన్యం రెండు నెలల క్రితం తమను తొలగించిందన్నారు.
ఉపాధి లేకపోవడంతో కొత్త టెండర్ పిలిచి తమకు ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మొరపెట్టుకున్నామన్నారు. ఈమేరకు కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్జ్యోతితో మాట్లాడారన్నారు. 213 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను తిరిగి ఉద్యోగాలకు తీసుకునేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించారని ఆనందం వ్యక్తంచేశారు.
