ప్రజావాణికి 2,192 అప్లికేషన్లు

ప్రజావాణికి 2,192 అప్లికేషన్లు

పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు​ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. ముఖ్యంగా డబుల్​బెడ్​రూమ్ ​ఇండ్లు, భూములు కబ్జాకు గురయ్యాయని గత సర్కార్​లో తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని  తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ బాధితులు నోడల్​అధికారి దివ్యను కలిసి సమస్యలను వివరించారు.

ఇందులో భాగంగా సుమారు 3 00 మంది హోంగార్డులను గత ప్రభుత్వం  తొలగించిందని తిరిగి విధుల్లోకి తీసుకుని ఆదుకోవాలని మాజీ హోంగార్డులు కోరారు. కోర్టుకు వెళితే తిరిగి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని హైదరాబాద్ ​సిటీ హోంగార్డ్స్ యూనియన్​​ పేర్కొంది. ప్రజావాణికి మొత్తం 2,192 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. భారీగా వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న నోడల్​ అధికారి మరో 10 కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేశారు.

ALSO READ:  మార్కెట్‌‌లోకి హెచ్‌‌పీ స్పెక్టర్‌‌‌‌ ఎక్స్‌‌ 360