కౌన్సిలర్ బరిలో బీటెక్ యువతి

కౌన్సిలర్ బరిలో బీటెక్ యువతి

కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్​గా ఇటీవల బీటెక్ కంప్లీట్​ చేసిన యువతి బరిలో నిలిచారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కౌన్సిలర్​గా  కాంగ్రెస్​ పార్టీ తరపున 22 ఏండ్ల  రాంశెట్టి హర్షిత  పోటీ చేస్తున్నారు.  హర్షితకు పీసీసీ జనరల్​ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి  మంగళవారం బీ -ఫారం అందించారు.

కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించిన పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​గౌడ్​, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, పీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఏలె మల్లికార్జున్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.