- హాజరైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
- స్నాతకోత్సవ ఉపన్యాసం ఇచ్చిన సెర్బ్ సెక్రటరీ సందీప్ వర్మ
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం గ్రాండ్ గా జరిగింది. నాలుగేండ్ల తర్వాత కాన్వొకేషన్ నిర్వహించడంతో స్టూడెంట్స్, వర్సిటీ మాజీ వీసీలు, ఇతర ఆఫీసర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకాగా.. సైన్స్అండ్ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు సెక్రటరీ సందీప్ వర్మ చీఫ్ గెస్ట్ గా హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసం ఇచ్చారు. అంతకుముందు కాకతీయ యూనివర్సిటీ విశేషాలు, సాధించిన విజయాలను వీసీ తాటికొండ రమేశ్ వవరించారు. వర్సిటీకి క్యాంపస్సెలక్షన్స్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన 56 మందికి పీహెచ్డీ పట్టాలు గవర్నర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. గురువారం ఉదయమే 192 మందికి 276 గోల్డ్ మెడల్స్ ఇచ్చి ఆయా విద్యార్థులకు స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తో ఫొటో సెషన్కు అవకాశం ఇచ్చారు. కాగా గవర్నర్టూర్ సందర్భంగా కేయూలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్ భద్రతా చర్యలను పర్యవేక్షించగా.. కేయూ, హనుమకొండ, ఇంతేజార్ గంజ్, వివిధ స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు.
స్టూడెంట్ లీడర్స్ కు నో ఎంట్రీ..
కాన్వొకేషన్ ప్రోగ్రామ్కు వర్సిటీ డిపార్ట్మెంట్ల నుంచి స్టూడెంట్స్పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా వర్సిటీలో హాస్టల్స్, ఫుడ్, స్టాఫ్ తదితర విషయాలకు సంబంధించి చాలా సమస్యలు వేధిస్తుండడంతో ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు వీసీ, రిజిస్ట్రార్కు వినతిపత్రాలు ఇచ్చారు. చాలాసార్లు ఆందోళనలు కూడా చేశారు. కాగా, గవర్నర్ టూర్ నేపథ్యంలో వర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు కూడా కాన్వొకేషన్ప్రోగ్రామ్చూసేందుకు ఆడిటోరియం లోపలికి వచ్చారు. కాగా ఆయా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తారనే అనుమానంతో గవర్నర్స్పీచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లారు. గవర్నర్ మాట్లాడుతుండగా.. వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లడంతో విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కరించండి..
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను లంచ్టైమ్లో కేయూ విద్యా సంఘాల జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా కేయూతో పాటు రాష్ట్రంలోని వివిధ వర్సిటీలకు సంబంధించిన సమస్యలను గవర్నర్దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీల్లో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని గవర్నర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కేయూ జేఏసీ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి, నాయకులు గుగులోతు రాజునాయక్, ఎండీ పాషా, మంద భాస్కర్, కళ్లెపల్లి ప్రశాంత్, కొండపాక రాకేశ్, వేణురాజ్, పన్నాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టాలొచ్చిన ఆనందం
కాన్వొకేషన్ సందర్భంగా 2013 నుంచి 2015 వరకు వివిధ డిపార్ట్మెంట్ల లో ప్రతిభ చూపిన స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్, 2018, 2019లో పరిశోధనలు పూర్తి చేసిన అభ్యర్థులకు పీహెచ్డీ పట్టాలు పంపిణీ చేశారు. నాలుగేండ్ల తరువాత కాన్వొకేషన్ నిర్వహించడం, గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయడంతో ఆయా స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు.
చాలా సంతోషంగా ఉంది
హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ లేబర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనే అంశంపై రీసెర్చ్ చేసి పీహెచ్డీ పూర్తి చేశాను. ఈ అంశంపై రీసెర్చ్ చేసినందుకు మా ప్రొఫెసర్లు, గైడ్స్ ఎంతగానో సహకరించారు. నాలుగేండ్ల తరువాత కాన్వొకేషన్ నిర్వహించడం, అందులో గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టాలు అందించడం చాలా సంతోషంగా ఉంది.
- సూత్రపు అనిల్, పీహెచ్డీ అవార్డీ
ఎంకామ్ లో మూడు గోల్డ్ మెడల్స్
ఎంకామ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించేందుకు చాలా కష్టపడ్డాను. అనుకున్నట్టుగానే బెస్ట్ మార్కులతో పాస్ అయ్యాను. మేనేజ్మెంట్ అకౌంటింగ్ పేపర్ లో చూపిన ప్రతిభకు నాకు మూడు గోల్డ్ మెడల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఒకే పేపర్లో మూడు మెడల్స్ రావడం సంతోషంగా ఉంది.
- కన్నూరి మంజుల, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్