సరుకుల కంటెయినర్ లో గంజాయి బస్తాలు

సరుకుల కంటెయినర్ లో గంజాయి బస్తాలు

 

  • సీజ్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు
     

విజయవాడ: సరుకులు తరలించే కంటెయినర్ లో గంజాయి బస్తాలు చూసి పోలీసులు షాక్ తిన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఆదివారం జరిగిందీ ఘటన. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా సరుకుల కంటెయినర్ వాహనంలో 26 గంజాయి బస్తాలు కనిపించాయి. 
విశాఖ జిల్లాలోని లంబసింగి నుంచి తెలంగాణలోని వరంగల్ కు గంజాయి తరలిస్తున్నట్లు  పోలీసులు గుర్తించారు. కంటెయినర్ డ్రైవర్, క్లీనర్లను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ నిర్దిష్ట పత్రాలు చూపించలేదు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంటెయినర్ డ్రైవర్, క్లీనర్లు  మిరాజ్, దేవేందర్ సింగ్ లను  జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు.