
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం జరిగిన టీఎస్ టెట్ పరీక్షకు 23,603 మంది అటెండ్ అయ్యారు. పేపర్ 2 సోషల్ స్టడీస్ స్ట్రీమ్ కు రెండు సెషన్లలో 28,426 మందికి గానూ 4823 మంది హాజరుకాలేదు. మార్నింగ్ సెషన్లో 82.65%, ఆఫ్టర్ నూన్ సెషన్లో 83.40% మంది హాజరయ్యారు. బుధవారం కూడా సోషల్ స్టడీస్ స్ర్టీమ్కు ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నాయి.