50కి చేరిన చనిపోయిన వారి సంఖ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2380కి చేరింది. 24 గంటల్లో 24 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్ బులెటన్ రిలీజ్ చేశారు. వారిలో ఐదుగురికి కోయంబేడు మార్కెట్లో లింక్ ఉన్నట్లు చెప్పారు. చనిపోయిన వారి సంఖ్య 50కి చేరుకుంది. 103 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు చెప్పారు. మొత్తం యాక్టివ్ కేసులు 747. 24 గంటల్లో మొత్తం 9880 శ్యాంపిల్స్ టెస్ట్ చేశారు.