డేంజరస్ యాడ్ స్కాం..నెలకు 25లక్షలఫోన్లలో విధ్వంసం..ఇండియాలోనే అత్యధికం

డేంజరస్ యాడ్ స్కాం..నెలకు 25లక్షలఫోన్లలో విధ్వంసం..ఇండియాలోనే అత్యధికం

కాలిడోస్కోప్ అని పిలువబడే కొత్త రకం యాడ్స్ ప్రచారం మోసం.. నిశ్శబ్ధంగా లక్షల కొద్ది ఆండ్రాయిడ్ ఫోన్లలో విధ్వంసం సృస్టిస్తోంది. రోజువారీ వినియోగించే యాప్ లను సైబర్ నేరగాళ్లకు డబ్బులు సృష్టించే యంత్రాలుగా మారుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు తలనొప్పిగా మారింది. ప్రతి నెలా 2.5 లక్షల ఆండ్రాయిడ్ డివైజ్ లు వైరస్ బారిన పడుతున్నాయి.ఇది భారత్ లో నే ఎక్కువ. ఇందులో 20శాతం ఆండ్రాయిడ్ ఫోన్లు భారత్ కు చెందినవే అని సైబర్ భద్రతా రిపోర్టులు చెబుతున్నాయి. 

IAS థ్రెట్ ల్యాబ్స్ రిపోర్టు ప్రకారం.. ఈ డేంజర్ యాడ్ స్కాం ద్వారా గూగుల్ ప్లే స్టోర్లలో కనిపించే యాప్ లలో థర్డ్ పార్టీకి చెందిన హానికరమైన క్లోన్లు ఉంటాయట. థర్డ్ పార్టీ స్టోర్ల ద్వారా ఇన్ స్టాలేషన్, సోషల్ మీడియా, మేసేజింగ్ ప్లాట్ ఫాం నుంచి ప్రత్యక్షంగా లింకుల ద్వారా డౌన్ లోడ్  చేస్తే ఈ యాడ్ స్కాం ఉచ్చులో పడిపోతారు.  ఈ హానికరమైన వెర్షన్లు కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఫుల్ స్క్రీన్ యాడ్స్ ను అందిస్తాయి. IAS ప్రకారం..ప్రతినెలా 25లక్షల ఆండ్రాయిడ్ ఫోన్లు వైరస్ బారిన పడుతున్నాయి. అందులో 20 శాతం భారత్ దేశానికి చెందినవే. ఇండోనేషియా, పిలిప్పీన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా ప్రజలు ఈ యాడ్ స్కాంలో ఇరుక్కున్నారు. 

ఈ యాడ్ స్కాం లో ఎలా చిక్కుకుంటారంటే..

ఒక యూజర్ Google Play నుంచి యాప్ ను ఇన్ స్టా్ల్ చేసినప్పుడు అది ఒరిజనల్ గా నే కనిపిస్తుంది. కానీ సైబర్ నేరగాళ్లు వారి క్రైం బుద్దిని ఉపయోగించి అనధికారిక మార్గాల ద్వారా హానికరమైన కోడ్‌తో కనిపించే వెర్షన్లను పంపిణీ చేస్తారు. ఇక్కడే యూజర్లు మోసపోతారు. వెర్షన్ల అప్డేట్, కొత్తగా డౌన్ లోడ్ చేసుకుంటున్నప్పుడు అది ఒరిజనల్ గా అనుకుంటారు మోసమోతారు. 

►ALSO READ | Phone Safety: ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేస్తే మీ ఫోన్ సేఫ్.. దొంగిలించినా ఎక్కడున్నా పట్టుకోవచ్చు..