సికింద్రాబాద్,వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు కృష్ణ యాదవ్కుటుంబానికి ట్రాఫిక్ పోలీసులు ఆర్థికసాయం అందించారు. కృష్ణ యాదవ్ ఐదేండ్లుగా బేగంపేట ట్రాఫిక్ పీఎస్ లో డ్యూటీ చేస్తున్నాడు. గతేడాది డిసెంబరు 23న జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో అతడు మృతి చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.
కృష్ణయాదవ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తెలియడంతో నార్త్జోన్ ట్రాఫిక్ పోలీసులు రూ.2.50 లక్షల విరాళాలు సేకరించారు. మంగళవారం హోంగార్డు కృష్ణ యాదవ్ కుటుంబానికి నార్త్జోన్ ట్రాఫిక్ డీసీపీ సుబ్బరాయుడు అందజేశారు.