తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 87,110 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,524 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా వ్యాప్తి కేసులపై రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా ghmc పరిధిలో 307 కొత్త కేసులు నమోదు కాగా..అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 9 కేసులు గుర్తించారు. ఇవాల 3,464 మంది కరోనా నుంచి కోలుకోగా.. 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,78,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 5,40,986 మంది కోలుకున్నారు. ఇంకా 34,084 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.53 శాతానికి పెరిగింది.