తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 8 మంది మృతిచెందారు. నేటితో రాష్ట్రంలో మొత్తం 4737 కేసులు నమోదుకాగా.. 182 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఒక్కరోజే 179 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి లో 24, మేడ్చల్ లో 14, రంగారెడ్డిలో 11, మహాబూబ్ నగర్ లో 4, వరంగల్ రూరల్, అర్బన్, కరీంనగర్, నల్గొండ, ములుగు, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది.

For More News..

పంజాబ్‌లో 17మంది పోలీసులకు కరోనా

బ్యాంకు క్యాషియర్ కు కరోనా.. మరి ఖాతాదారుల సంగతేంటో..