కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సమయంలో స్కూళ్లు తెరవడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్నా…రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే ఆసక్తి చూపింది. దీంతో ఈ నెల 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో 9,10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్ కాలేజీలను పునరుద్ధరించారు. రోజు మార్చి రోజు ఒకపూట తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే.. బుధవారం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు, టీచర్లకు కరోనా పరీక్షలను నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దాదాపు 262 మంది విద్యార్థులకు, 160 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన్న వీరభద్రుడు తెలిపారు. అయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదని ఆయన అన్నారు. అన్ని స్కూళ్లలో కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తున్నామని, అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. నిన్న (నవంబర్-4) రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు వచ్చారని… వీరిలో 262 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అంటే… కరోనా కేసుల శాతం 0.1 శాతం కంటే తక్కువేనని అన్నారు. పాఠశాలలకు వచ్చినందువల్లే వీరికి కరోనా వచ్చిందని ఆరోపించడం సరి కాదన్నారు. ప్రతి తరగతి గదిలో 15 నుంచి 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్లకు కరోనా పాజిటివ్
- ఆంధ్రప్రదేశ్
- November 6, 2020
మరిన్ని వార్తలు
-
NBK109 Release date: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్?
-
RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్కు రింకూ ఫిదా
-
Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర
-
ఆఫీసర్ రోల్స్ ఎంజాయ్ చేస్తా..జేసన్ షా ఇంట్రెస్టింగ్ జర్నీ
లేటెస్ట్
- NBK109 Release date: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్?
- RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్కు రింకూ ఫిదా
- Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర
- ఆఫీసర్ రోల్స్ ఎంజాయ్ చేస్తా..జేసన్ షా ఇంట్రెస్టింగ్ జర్నీ
- ఢిల్లీలో ఆప్ జైల్ భరో మార్చ్.. BJP ఆఫీస్ ముందు నిరసన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- మూలికలతో మొదలైన హిమాలయ.. ఇప్పుడు ఇండియాలోనే పెద్ద మార్కెట్
- OTT Movies: ఓటీటీకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ మూవీస్.. అస్సలు మిస్ అవకండి!
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- అత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే వ్యక్తి మృతి
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..