హైదరాబాద్, వెలుగు: వీఐపీ జోన్ జూబ్లీహిల్స్లో పటిష్టమైన సెక్యూరిటీ నిర్వహిస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కేబీఆర్ పార్క్ వాకర్స్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఏర్పాటు చేసిన 264 సీసీ కెమెరాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సేఫ్ అండ్ సెక్యూరిటీలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నారు.
ఇన్వెస్టిగేషన్లో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కమ్యూనిటీ సీసీ ప్రాజెక్ట్లో భాగంగా వివిధ వ్యాపార సంస్థలు రూ.1.4 కోట్లు సమకూర్చగా.. వీటితో కేబీఆర్ పార్క్ చుట్టూ అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దాతలు రెయిన్బో హాస్పిటల్ ఎండీ దొడ్ల సునీల్ రెడ్డి, ఒమేగా హాస్పిటల్స్ ఎండీ నమ్రత, న్యూరో హాస్పిటల్స్ ఎండీ సాంబశివరెడ్డిని సీపీ ఆనంద్ సన్మానించారు.