చార్మినార్ వద్ద పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్

చార్మినార్ వద్ద పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్

ఓల్డ్​సిటీ, వెలుగు: రైల్వే ప్రొటెక్షన్​ఫోర్స్​26వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ (ఏఐపీబీసీ)ను రెండో రోజు బుధవారం చార్మినార్​వద్ద నిర్వహించారు. 24 రాష్ట్రాల నుంచి 24 బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. పోలీస్​బ్యాండ్​సంప్రదాయాలు, సంగీత నైపుణ్యాలను ప్రదర్శించారు.  సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన పోటీలు చార్మినార్​కు వచ్చిన సందర్శకులను ఆకర్షించాయి. పోటీలను ఐఆర్​పీఎఫ్​ఎస్ ఐజీ అవోమా సింగ్ ఠాకూర్ ప్రారంభించారు.