- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ కోసం జిల్లాలో 27,203 టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని నిజామాబాద్కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. సోమవారం మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. యూరియా నిల్వలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని, రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే నిజామాబాద్లోనే ఎక్కువ స్టాక్ ఉందన్నారు.
యాప్ ద్వారా పూర్తి పారదర్శకంగా పంపిణీ చేస్తామని, సాగు విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. డీలర్వద్ద ఏ స్టాక్ ఎంత ఉందో తెలిపే బోర్డులు పెట్టిస్తామన్నారు. నాసిరకం, నకిలీ యూరియా, సీడ్ విక్రయాలు జరగకుండా స్పెషల్ఆఫీసర్లు, తహసీల్దార్లతో తనిఖీలు చేయిస్తామన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 146 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలకు రిఫర్ చేశారు.
