
- ప్రకటించిన లెబనాన్ ప్రధాన మంత్రి
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్లో భారీ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ కారణమని అధికారులు చెప్పారు. మొదట ఏదైనా దాడి జరిగి ఉంటుందని అంచనా వేసిన అధికారులు అమ్మోనియం నైట్రేట్ కారణమని చెప్పారు. ఓ గోడౌన్లో దాదాపు 2700 టన్నుల అమ్మోనియం నిల్వ చేశారని అధికారులు చెప్పారు. గత ఆరు సంవత్సరాలుగా రసాయనాలు స్టోర్ చేశారని, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రధాని హసాన్ దియాబ్ అన్నారు. దీనిపై విచారణ జరిపి, కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. బీరుట్లో మంగళవారం జరిగిన పేలుళ్లలో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే దాదాపు 4వేల మంది గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. భారీ పేలుళ్లకు కూలిపోయిన భవనాలు శిథిలాల్లో చిక్కుకుపోయి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వందల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.