- ప్రగతిభవన్లో అందజేసిన కేసీఆర్
- ఇంకా అందుకోవాల్సినవాళ్లు 21 మంది
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఇంకో 29 మందికి పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్సోమవారం ప్రగతి భవన్లో బీఫామ్స్ అందజేశారు. ఆదివారం 69 మందికి బీ ఫామ్స్ అంద జేయగా.. కొత్తగా ఇచ్చిన వారితో కలిపి ఆ సంఖ్య 98కి చేరింది. ఇంకో 21 నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫామ్స్ అందజేయాల్సి ఉంది. వారికి మంగళవారం
ఇచ్చే చాన్స్ ఉంది.
సోమవారం బీఫామ్స్ అందుకున్నవాళ్లు:
కల్వకుంట్ల సంజయ్ (జగిత్యాల), డాక్టర్ ఎన్ . సంజయ్ కుమార్ (కోరుట్ల), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), కోరుకంటి చందర్ (రామగుండం), పుట్ట మధు (మంథని), చింత ప్రభాకర్ (సంగారెడ్డి), మల్లారెడ్డి (మేడ్చల్), కేపీ వివేకానంద్ (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలె యాదయ్య (చేవెళ్ల), కొప్పుల మహేశ్ రెడ్డి (పరిగి), మెతుకు ఆనంద్ (వికారాబాద్), ముఠా గోపాల్ (ముషీరాబాద్), కాలేరు వెంకటేశ్ (అంబర్పేట్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), పద్మారావు గౌడ్(సికింద్రాబాద్), లాస్య నందిత (కంటోన్మెంట్), గొంగిడి సునీత (ఆలేరు), శానంపూడి సైదిరెడ్డి (హుజూర్నగర్), డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్), బానోత్ శంకర్ నాయక్ (మహబూబాబాద్), చల్లా ధర్మారెడ్డి (పరకాల), ఆరూరి రమేశ్ (వర్ధన్నపేట), గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), మాణిక్ రావు (జహీరాబాద్).