తెలంగాణలో మరో 2,924 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో మరో 2,924 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,924 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,23,090 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 818కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1638 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 90,988గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,284 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 50,798 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13,27,791 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 461, కరీంనగర్ 172, ఖమ్మం 181, రంగారెడ్డి 213, నల్గొండ 171, మేడ్చల్ 153, నిజామాబాద్ 140, సూర్యపేట్ 118, వరంగల్ అర్బన్ 102, సిద్ధిపేట్ 97, జగిత్యాల 92, మంచిర్యాల్ 91, భద్రాద్రి 88, పెద్దపల్లి 83, మహబూబా బాద్ 80, యాదాద్రి 64, మహబూబ్ నగర్ 58, కామారెడ్డి 56, సిరిసిల్ల 55, నాగర్ కర్నూల్ 51 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

లీడర్లు కాంట్రాక్టర్లయిన్రు.. కాంట్రాక్టర్లు లీడర్లయిన్రు

నాకు ఆ పాత్ర చేయాలని ఎప్పటినుంచో ఉంది

బాక్సర్‌గా బరిలోకి దిగుతున్న తెలుగమ్మాయి

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పర్మినెంట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం?