దొంగ ఓట్లు వేయిస్తున్న ముగ్గురు ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు పట్టుకున్నారు. 2023, నవంబర్ 30వ తేదీ గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్ సమయంలో హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోగస్ ఓటు వేయిస్తున్న ముగ్గురు ఎంఐఎం పార్టీ కార్యకర్తలను టాస్క్ ఫోర్స్, హబీబ్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి పట్టుకున్నారు.
నిందితుల నుంచి 67 డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డులతో పాటు కెమికల్స్, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు దొంగ ఓట్లు వేయమని చెప్పారని.. ఎంతమందితో బోగోస్ ఓట్లు వేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు.