- నిందితుడి అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాపైన బాలుడు దొరికాడు. వార్త మీడియాలో రావడంతో అతన్ని తీసుకెళ్లిన వ్యక్తే గురువారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అప్పగించాడని సీఐ మల్లేశ్ తెలిపారు. గత నెల 20న రైల్వేస్టేషన్నుంచి నిఖిల్(3) కిడ్నాప్అయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తుండగా.. చింతల్కు చెందిన షేక్మహబూబ్ అలీ అనే వ్యక్తి బాబును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు బాలుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు.
