ఇబ్రహీంపట్నం, వెలుగు: నిజాం కాలంలో నిర్మించిన ఫిరంగి నాలా కబ్జాకు గురవుతోంది. పాత రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి నుంచి 85 కిలోమీటర్ల పొడవున పదుల సంఖ్యలో చెరువులను కలుపుతూ ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వరకు దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆదిభట్లలో ఓ నిర్మాణ సంస్థ ఫిరంగి నాలాను కబ్జా చేసి, గోడ నిర్మిస్తోంది. గ్రామస్తుల ఫిర్యాదుతో రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు గురువారం సంబంధిత స్థలాన్ని పరిశీలించారు.
నాలా కబ్జా నిజమేనని తేల్చి, సదరు నిర్మాణ సంస్థ వారిని హెచ్చరించారు.ఫిరంగి నాలా, బఫర్జోన్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు.ఇరిగేషన్ఏఈ సునీత, వర్క్ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవి, జీపీవో జగన్ కుమార్ పాల్గొన్నారు.
