48 గంటలు.. 12 మంది టెర్రరిస్టులు హతం

48 గంటలు.. 12 మంది టెర్రరిస్టులు హతం

షోపియాన్: సెక్యూరిటీ ఫోర్సెస్ తో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్, షోపియాన్ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఇదే సమయంలో అనంతనాగ్ జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. గత 48 గంటల్లో జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టడం గమనార్హం. పక్కా సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించి ముష్కరుల పనిపడుతున్నాయి.