కవ్వాల్​ టైగర్​ జోన్​లో  రయ్ రయ్ !​. అమలు కాని 30 కిలోమీటర్ల స్పీడ్​ లిమిట్ 

కవ్వాల్​ టైగర్​ జోన్​లో  రయ్ రయ్ !​. అమలు కాని 30 కిలోమీటర్ల స్పీడ్​ లిమిట్ 
  • ఓవర్​ స్పీడ్​తో దూసుకెళ్తున్న వెహికల్స్​ 
  • 80 నుంచి 100 కిలో మీటర్లకు తగ్గని వేగం
  • వాహనాలు ఢీకొని గాయపడుతున్న వణ్యప్రాణులు 
  • స్పీడ్​ కంట్రోల్​పై పట్టించుకోని ఫారెస్ట్​ ఆఫీసర్లు ​ 

జన్నారం, వెలుగు: కవ్వాల్​టైగర్​జోన్​లో వెహికల్స్​ఓవర్​ స్పీడ్​తో వెళ్తున్నాయి. ఏ వెహికల్ అయినా గంటకు 80 –100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. గంటకు 30 కిలోమీటర్ల స్పీడ్​రూల్స్​ఉన్నా ఎవరూ పాటించడం లేదు. వాహనదారులకు కనిపించేలా ఫారెస్టులో  బోర్డులు ఏర్పాటు చేసినా పట్టించుకో కుండా వెళ్లిపోతున్నారు. వెహికల్స్​స్పీడ్​కంట్రోల్​పై ఫారెస్టు ఆఫీసర్లు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పడం తప్ప ఓవర్​ స్పీడ్​తో వెళ్తున్నవారిపై ఎలాంటి యాక్షన్​తీసుకోవడం లేదు. 

వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు 

వెహికల్స్​ ఓవర్​ స్పీడ్​తో వెళ్తుండుగా వన్యప్రాణులు ముప్పు పొంచి ఉంది. రోడ్డుకు ఇరువైపులా అడవి విస్తరించి ఉండడంతో జంతువులు రోడ్డు దాటే క్రమంలో వెహికల్స్​స్పీడ్​కారణంగా  యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.   వాహనాల రాకపోకలతో పాటు రాత్రివేళల్లో వెహికల్స్​ సౌండ్​, లైటింగ్​తో జంతువులు బెదిరిపోతున్నాయి. కొన్నిరకాల వణ్యప్రాణులు రాత్రిపూట మాత్రమే ఆహారం కోసం బయట సంచరిస్తుంటాయి. వాహనాల కారణంగా స్వేచ్ఛగా తిరగడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి. ఎన్ని జంతువులు చనిపోయాయనే రికార్డు ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​ వద్ద  లేకపోవడం వన్యప్రాణుల రక్షణపై అధికారుల తీరుకు ఏంటో తెలుస్తుంది.  

వాహదారులకూ గాయాలు 

వాహనదారులు స్పీడ్ గా జంతువులను ఢీకొట్టి గాయపడుతున్నారు. ఎదురుగా వణ్యప్రాణులు  వచ్చినప్పుడు స్పీడ్​కంట్రోల్​చేయలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కింద మంచిర్యాలకు చెందిన దంపతులు బైక్​పై జన్నారం వెళ్తుండగా తపాల్​పూర్​సమీపంలో వన్యప్రాణి అడ్డురావడంతో తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టి పడిపోయారు. భార్య చనిపోగా  భర్త గాయపడ్డాడు. మహ్మదాబాద్​సమీపంలో ఆటోకు అడవి పంది అడ్డురావడంతో బోల్తాపడింది. నలుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. జన్నారం డీర్​పార్క్​సమీపంలో అడవిపందిని తప్పించబోయి ఆటో పల్టీ కొట్టటడంతో  ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా నిత్యం ప్రమాదాలు  జరుగుతున్నా ఫారెస్ట్​ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

టైగర్​ జోన్​లో ఎన్నో రూల్స్ 

​  2012లో  కవ్వాల్ టైగర్​ రిజర్వ్ ఏర్పాటైంది. జన్నారం మీదుగా మంచిర్యాల-, నిర్మల్, మంచిర్యాల- ఆదిలాబాద్​రోడ్లు ఫారెస్ట్ కోర్​ఏరియా నుంచి వెళ్తాయి. ఆయా రూట్లలో ఎటూ 60 కిలోమీటర్ల పైనే దట్టమైన అడవి విస్తరించి ఉంది. వన్యప్రాణుల రక్షణ కోసం ఫారెస్టు డిపార్ట్​మెంట్​ఎన్నో రూల్స్​అమలు చేస్తుంది.  ఎప్పటినుంచో భారీ వాహనాల రాకపోకలను నిషేధించింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వెహికల్స్​రాకపోకలపై నియంత్రణ ఉన్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.

ఫారెస్ట్ రూల్స్​తో ఇబ్బందులు పడుతున్నామని కోర్​ ఏరియా పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఆందోళనలు చేయడంతో ఫారెస్టు ఆఫీసర్లు కొంత వెనక్కు తగ్గారు. ముఖ్యంగా వన్యప్రాణుల సంచారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 30 కిలోమీటర్ల స్పీడ్​లిమిట్​ను అమలు చేస్తున్నారు. కానీ దీనిని ఎవరూ ఫాలో కావడం లేదు. అప్పుడప్పుడు ఫారెస్టు ఆఫీసర్లు నాకాబందీ నిర్వహించి వెహికల్స్​చెక్​ చేస్తూ స్పీడ్​ లిమిట్​పై వాహనదారులకు చెప్తున్నారు. కానీ, స్పీడ్ గా వెళ్లి వాహనాలపై  కఠిన చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.