మరికల్, వెలుగు: మండలంలోని చిత్తనూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు చెందిన 30 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. తన చేనులో పండించిన పత్తిని ఇంట్లో ఓ గదిలో నిల్వ ఉంచాడు. ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పత్తితో పాటు ఇంట్లో ఉన్న నగదు, ఇతర వస్తువులు కాలిపోయాయి.
ఇంటి పై భాగం సైతం కాలిపోయింది. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. నష్టపోయిన రైతును ఆదుకోవాలని వారు కోరారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ సుధాకర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.
