- వాంతులు, విరేచనాలతో 34 మందికి తీవ్ర అస్వస్థత
- రహస్యంగా ఉంచిన గురుకుల సిబ్బంది
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా మోత్కూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 30 మందికి పైగా స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్తున్న స్టూడెంట్స్ను రాత్రికి రాత్రే పీహెచ్సీకి తరలించి ట్రీట్మెంట్ ఇప్పించారు. అయితే ఫుడ్ పాయిజన్ విషయాన్ని సిక్రేట్గా ఉంచేందుకు ప్రయత్నించినా జిల్లా ఆఫీసర్లు రావడంతో శనివారం మధ్యాహ్నం బయటకు పొక్కింది. శుక్రవారం రాత్రి వంకాయ కూరతో పాటు కోడిగుడ్లు ఉడికించి స్టూడెంట్స్కు భోజనంలోకి అందించారు. భోజనం చేసిన తర్వాత 8వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న 30 మందికి పైగా స్టూడెంట్స్కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్తుంటే గమనించిన స్కూల్ హెల్త్ సూపర్ వైజర్ మంగమ్మ, టీచర్స్ కలిసి 108కు సమాచారం అందించి రాత్రి 10 గంటల తర్వాత మోత్కూర్ పీహెచ్సీకి తరలించారు.
డాక్టర్లు ట్రీట్మెంట్ అందించి తెల్లవారుజామున 3 గంటలకు రెసిడెన్షియల్ కు తరలించారు. హెల్త్ స్టాఫ్ పర్యవేక్షణలోనే ఉంచారు. ఫుడ్ పాయిజన్ విషయాన్ని కలెక్టర్ పమేలా సత్పతికి గురుకులం ప్రిన్సిపాల్ వెంకటస్వామి సమాచారం అందించారు. కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ రజిని, డీసీవో శ్రీరాం శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ వో యశోద, పీవోఎన్సీడీ డాక్టర్ సుమన్ కల్యాణ్ మోత్కూరుకు వచ్చి స్టూడెంట్స్ ఆరోగ్య పరిస్థితిని ఆఫీసర్లు అడిగి తెలుసుకున్నారు. వంటకాల శాంపిల్స్ను ఫుడ్ సేఫ్టీ స్టాఫ్ సేకరించి నాచారంలోని టెస్టింగ్ ల్యాబ్కు పంపించారు.