అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 3 లక్షల నగదు సీజ్

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 3 లక్షల నగదు సీజ్

కాగజ్ నగర్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలని, రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన డాక్యుమెంట్స్ ఉండాలని కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ సూచించారు. ఆదివారం సిర్పూర్ టీ మండలం వెంకటరావు పేట్ అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో సుమారు మూడున్నర లక్షలను పోలీసులు సీజ్ చేశారు.

కౌటాల మండలం మొగడ్ ధగడ్ గ్రామానికి చెందిన నరులే భరత్ అనే వ్యక్తి వద్ద రూ. 2 లక్షల 72 వేలు, ఛత్తీస్​గఢ్ నుంచి హైదరాబాద్​కు బొలెరో వాహనంలో వెళుతున్న ఇంద్రజిత్ రేణుకే వద్ద రూ.70 వేలు పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. కౌటాల సీఐ సాదిక్ పాషా, ఎస్ఐ దీకొంద రమేశ్, సిబ్బంది ఉన్నారు.