360 మంది భారత ఖైదీల విడుదల

360 మంది భారత ఖైదీల విడుదల

దేశ జైళ్లలో ఉన్న55 మంది భారత జాలర్లను విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది . నాలుగు విడతల్లో ఏప్రిల్ నెలాఖరుకు అందరినీ వదిలేస్తామని చెప్పింది . మరో ఐదుగురు మామూలు ఖైదీలను విడిచి పెడతామని తెలిపింది . ప్రస్తుతం పాకిస్థాన్ లో 537 మంది భారతీయ ఖైదీలు, ఇండియాలో 347 మంది పాకిస్థానీ ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు. పాక్ నిర్ణయంపై ఇండియా పాజిటివ్ గా స్పందిస్తుందని భావిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ చెప్పారు.