3,723 కేజీల గంజాయి దహనం

3,723 కేజీల గంజాయి దహనం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పలు పోలీస్​ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 3,723 కేజీల గంజాయిని దహనం చేశామని ఎస్పీ బి. రోహిత్​ రాజు తెలిపారు. హేమచంద్రాపురం గ్రామ శివారల్లో డ్రగ్​ డిస్పోజల్​ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని పోలీస్​లు దహనం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో 55కేసుల్లో దాదాపు రూ. 9.31కోట్ల విలువైన 3,723 కేజీల నిషేధిత గంజాయిని సీజ్​ చేశామన్నారు.  

గంజాయిని విక్రయించే వారితో పాటు తాగే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెడతున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో డీఎస్పీ రెహమాన్​, సతీశ్​కుమార్, మల్లయ్య స్వామి, సీఐ శ్రీనివాస్​తో పాటు పలువురు పోలీస్​ అధికారులు పాల్గొన్నారు.