లండన్ లో భారత సంతతి వ్యక్తి హత్య.. మూడు రోజుల్లోనే రెండో ఘటన

లండన్ లో భారత సంతతి వ్యక్తి హత్య.. మూడు రోజుల్లోనే రెండో ఘటన

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఇండియన్ హత్య చేయబడ్డాడు. జూన్ 16న చోటుచేసుకున్న ఈ ఘటనలో 38 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి  చంపారు. అంతకుముందు రోజు సల్మాన్ సలీం అనే 25 ఏళ్ల యువకుడిపై హత్య చేసినట్టు వార్తలు వచ్చాయి.

సౌతాంప్టన్ వే, క్యాంబర్‌వెల్‌లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీలో జరిగిన ఈ హత్యకు సంబంధించిన సమాచారం అందుకోగానే అధికారులను సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో భారత సంతతికి చెందిన అరవింద్ శశికుమార్ కత్తి గాయాలతో కనిపించాడని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. జూన్ 16న (శుక్రవారం) తెల్లవారుజామున 1.31 గంటలకు అరవింద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.