V6 News

తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చడం సిగ్గుచేటు : డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్

 తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చడం సిగ్గుచేటు : డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: పార్లమెంట్​సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్​ను పోల్చడం సిగ్గుచేటని, ఆదిలాబాద్ ​డీసీసీ అధ్యక్షుడు నరేశ్ ​జాదవ్​ ఫైర్​ అయ్యారు. ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్​లోని తెలంగాణ చౌక్​లో ప్రధాని మోదీ, తేజస్వి సూర్య దిష్టిబొమ్మలను దహనం చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల మనోభావాలను పదేండ్లుగా కించపరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​చేశారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.