తెలంగాణలో నాలుగు కరోనా కేసులు

తెలంగాణలో నాలుగు కరోనా కేసులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా 402 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా..4 కేసులు పాజిటివ్​ వచ్చినట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మూడు గంటల పాటు కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 పై  రివ్యూ జరిపారు.

కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ రాజారావుకు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరడంతో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 పై డీహెచ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.