తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం కొత్త‌గా 41 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 23 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా, రంగారెడ్డిలో 1, వలస కార్మికులు 11, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. మిగిలిన 19 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివిగా తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,854కి చేరింది. ఈ రోజు మరణించిన నలుగురుతో కలిపి.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 53కి పెరిగింది. ఇక 709 యాక్టివ్ కేసులు ఉండగా.. 1092 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.