
హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన వాటిలో 34 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వారితో పాటు మరో ఎనిమిది మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,634కి చేరింది. ఇవాళ 9 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 1011 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 38 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రస్తుతం 585 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.